షార్జా రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
- August 28, 2020
షార్జా: ఓ ట్రక్, మరో రెండు వాహనాల్ని ఢీకొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. అల్ ధయిద్, షార్జా రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐదు మరియు ఆరు ఇంటర్ఛేంజ్ల మధ్య ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1.20 నిమిషాల సమయంలో షార్జా పోలీస్ ఆపరేషన్ రూమ్ కి ఈ ఘటనపై తొలుత సమాచారం అందింది. వెంటనే ఎమర్జన్సీ క్రూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఓ ట్రక్ టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దెబ్బతిన్న వాహనాల్ని క్లియర్ చేసి, ట్రాఫిక్కి అనుమతించారు. వాహనదారులు వాహనాల టైర్ల పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సూచించింది.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!