తూర్పు సౌదీ ప్రాంతంలో 859 చోట్ల తనిఖీలు..

- August 29, 2020 , by Maagulf
తూర్పు సౌదీ ప్రాంతంలో 859 చోట్ల తనిఖీలు..

రియాద్:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీలోని దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అధికారులు సూచించిన మార్గనిర్దేశకాల అమలు తీరుకు సంబంధించి విస్తృత తనిఖీలు చేపట్టింది. మున్సిపాలిటి పరిధిలో ఏకంగా 859 చోట్ల తనిఖీలు నిర్వహించి కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. ప్రజల సంరక్షణార్ధం సౌదీ ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలను పలు చోట్ల ఉల్లంఘించినట్లు తమ తనిఖీల్లో మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. 41 చోట్ల కరోనా నియంత్రణ జాగ్రత్త చర్యలు పాటించటం లేదని నిర్ధారించుకొని తగిన చర్యలు చేపట్టారు. అదేసమయంలో నగరంలో 785 చోట్ల క్రిమిసంహారక చర్యలు కూడా చేపట్టినట్లు దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com