తూర్పు సౌదీ ప్రాంతంలో 859 చోట్ల తనిఖీలు..
- August 29, 2020
రియాద్:కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీలోని దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం అధికారులు సూచించిన మార్గనిర్దేశకాల అమలు తీరుకు సంబంధించి విస్తృత తనిఖీలు చేపట్టింది. మున్సిపాలిటి పరిధిలో ఏకంగా 859 చోట్ల తనిఖీలు నిర్వహించి కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించారు. ప్రజల సంరక్షణార్ధం సౌదీ ప్రభుత్వం సూచించిన ముందస్తు జాగ్రత్త చర్యలను పలు చోట్ల ఉల్లంఘించినట్లు తమ తనిఖీల్లో మున్సిపాలిటీ అధికారులు గుర్తించారు. 41 చోట్ల కరోనా నియంత్రణ జాగ్రత్త చర్యలు పాటించటం లేదని నిర్ధారించుకొని తగిన చర్యలు చేపట్టారు. అదేసమయంలో నగరంలో 785 చోట్ల క్రిమిసంహారక చర్యలు కూడా చేపట్టినట్లు దమ్మమ్ మున్సిపాలిటి అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







