దలైలామా భద్రతపై నిఘా పెంచిన భారత్
- August 29, 2020
దలైలామాకి భద్రతను మరింత పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిబెట్ను చైనా అక్రమించడంతో అక్కడ వుండే బౌద్ద గురువు దలైలామా భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దలైలామా భారత్లో ఉండడంతో టిబెట్ ఎప్పటికైనా చైనా నుండి విడుదల అవుతుందనే ఒక అశ టిబెట్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. మరోవైపు చైనా అమెరికాతో కూడా యుద్ధానికి కాలు దువ్వుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చైనా ఆక్రమించిన టిబెట్నీ ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు పావులు కదుపుతోంది. అమెరికా కనుక టిబెట్ ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తే దాని మిత్ర దేశాలు కూడా అలాగే చేస్తాయి. అదే జరిగితే దలైలామా కీలకం అవుతారు. అందుకే దలైలామా పై చైనా నిఘా పెట్టింది. .
ఇటీవలే భారత్లో చైనా గూడచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దలైలామాకు దగ్గరగా ఉంటూ ఆయన భద్రతకు సంబందించిన విషయాలను ఎప్పటికప్పుడు చైనాకు చేరవేస్తున్న గూఢచారిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. దలైలామాకు హాని తలపెట్టెందుకు చైనా ప్రయత్నిస్తుందనే సమాచారం వచ్చింది. దలైలామా భారత్ను రక్షణ కోరి వచ్చారు. కాబట్టి ఆయనకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత భారత్ వహించాల్సీంటుంది. అందుకే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను మరింతగా పెంచాలని నిర్ణయించింది...!!
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!