సోమవారంతో ముగియనున్న వర్క్ బ్యాన్
- August 29, 2020
మనామా:జులై 1న ప్రారంభమైన ఔట్ డోర్ వర్క్ బ్యాన్ సోమవారంతో ముగియనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది వర్క్ బ్యాన్ ప్రత్యేకతను సంతరించుకుంది. 2007లో ఈ వర్క్ బ్యాన్ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్ 300000కి పైగా వర్క్ సైట్స్, 150,000 మంది కార్మికులతో కూడిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చాలా సవాళ్ళను ఎదుర్కొంది ఈ సమయంలో. తొలుత కేవలం కన్స్ట్రక్షన్ వర్కర్స్కి మాత్రమే ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు చేసినా, ఆ తర్వాత వివిధ రంగాలకు విస్తరించడం జరిగింది. కాగా, ఈ ఏడాది లేబర్ మినిస్ట్రీ 6,315 తనిఖీల్ని నిర్వహించింది. 27 ఎస్టాబ్లిష్మెంట్స్పై పలు ఉల్లంఘనలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. 37 మంది కార్మికుల్ని జ్యుడీషియరీకి రిఫర్ చేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదీన్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత నేపథ్యంలో కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం వుంది గనుక, వారికి ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ ఉపశమనం కల్గిస్తుందనీ, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు 98 శాతం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?