సైబరాబాద్లో 10 మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- August 29, 2020
హైదరాబాద్: సైబరాబాద్లో పది మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా సభ్యులపై ఇప్పటికే పలు కేసులున్నాయని చెప్పారు. నగరంలోని జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ కాలనీలో దొంగలు షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. ముఠా సభ్యులు దొంగతనాల్లో ఆరితేరారని చెప్పారు. చోరీకి పాల్పడే ప్రాంతాన్ని ముందే పూర్తిగా పరిశీలిస్తారని… నేరం చేసే ప్రయత్నంలో ఆయుధాలు ఉపయోగిస్తారని చెప్పారు. అంతేకాదు చోరీ సమయంలో అడ్డువచ్చేవారిని చంపేందుకైనా వెనుకాడరన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడ్డారని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉన్నదని చెప్పారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!