సైబరాబాద్లో 10 మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- August 29, 2020
హైదరాబాద్: సైబరాబాద్లో పది మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా సభ్యులపై ఇప్పటికే పలు కేసులున్నాయని చెప్పారు. నగరంలోని జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ కాలనీలో దొంగలు షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. ముఠా సభ్యులు దొంగతనాల్లో ఆరితేరారని చెప్పారు. చోరీకి పాల్పడే ప్రాంతాన్ని ముందే పూర్తిగా పరిశీలిస్తారని… నేరం చేసే ప్రయత్నంలో ఆయుధాలు ఉపయోగిస్తారని చెప్పారు. అంతేకాదు చోరీ సమయంలో అడ్డువచ్చేవారిని చంపేందుకైనా వెనుకాడరన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడ్డారని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉన్నదని చెప్పారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్.



తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







