అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ విడుదల కేంద్ర ప్రభుత్వం

- August 29, 2020 , by Maagulf
అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ విడుదల కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసింది. మరిన్ని ఆంక్షలను సడలించింది. మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇచ్చింది.విద్యా సంస్థలను మరికొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది.

అన్‌లాక్ 3.0 ముగుస్తున్న వేళ కేంద్రం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో రైలు సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు తదితర కార్యక్రమాలకు 100 మందికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. స్కూళ్లు, కాలేజీలను మరి కొంత కాలం మూసివేసే ఉంచాలని స్పష్టం చేసింది. వివిధ కార్యకలాపాలకు సంబంధించి మరిన్ని సడలింపులు ప్రకటించింది. తాజా మార్గదర్శకాలు సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com