ఆన్ లైన్ లో విద్యార్ధుల అడ్మిషన్ రిజిస్ట్రేషన్, బదిలీ ప్రక్రియ దరఖాస్తులు
- August 30, 2020
దోహా:కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఖతార్ ప్రభుత్వం..విద్యాశాఖలో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ స్కూల్స్ కు సంబంధించి అన్ని సేవలను ఆన్ లైన్ లో అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్ట్ 30 నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులు ఎవరు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావొద్దని కూడా సూచించింది. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ లో పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పాఠాశాలలకు సంబంధించిన సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చని తెలిపింది. https://eduservices.edu.gov.qa/ లింక్ ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రులు సర్టిఫికెట్ సేవలు, పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్ దరఖాస్తు, ఇతర స్కూల్స్ కు విద్యార్ధుల బదిలీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ఫీజ్, పుస్తకాల ఫీజు చెల్లింపులు, ట్రాన్స్ పోర్ట్ ఫీజు చెల్లింపులు చేయవచ్చని విద్యాశాఖ వివరించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







