ఆన్ లైన్ లో విద్యార్ధుల అడ్మిషన్ రిజిస్ట్రేషన్, బదిలీ ప్రక్రియ దరఖాస్తులు
- August 30, 2020
దోహా:కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న ఖతార్ ప్రభుత్వం..విద్యాశాఖలో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ స్కూల్స్ కు సంబంధించి అన్ని సేవలను ఆన్ లైన్ లో అందించనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్ట్ 30 నుంచి విద్యార్ధుల తల్లిదండ్రులు ఎవరు మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రావొద్దని కూడా సూచించింది. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ లో పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పాఠాశాలలకు సంబంధించిన సేవలను ఆన్ లైన్ లో పొందవచ్చని తెలిపింది. https://eduservices.edu.gov.qa/ లింక్ ద్వారా విద్యార్ధుల తల్లిదండ్రులు సర్టిఫికెట్ సేవలు, పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్ దరఖాస్తు, ఇతర స్కూల్స్ కు విద్యార్ధుల బదిలీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ఫీజ్, పుస్తకాల ఫీజు చెల్లింపులు, ట్రాన్స్ పోర్ట్ ఫీజు చెల్లింపులు చేయవచ్చని విద్యాశాఖ వివరించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







