5 నెలలుగా బ్యాట్ పట్టుకోని కోహ్లి
- August 30, 2020దుబాయ్:దుబాయ్లో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న IPL 13వ సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల21 వ తారీఖున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం దుబాయ్ చేరుకుందన్న విషయం తెలిసిందే... ప్లేయర్లందరూ క్వారంటైన్ పూర్తి చేసుకుని నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. దుబాయ్లో నిర్ణీత క్వారంటైన్ గడువు ముగించుకున్న ఆ జట్టు ప్లేయర్లు నెట్లో సాధన మొదలు పెట్టారు. ఇక ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ప్రాక్టీస్ చేశాడు.
అయితే ప్రాక్టీస్ తరువాత కోహ్లి మాట్లాడుతూ.. కరోనా వల్ల 5 నెలలుగా బ్యాట్ పట్టలేదని, తిరిగి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నానని.. అందువల్ల కొంత భయం వేసిందని అన్నాడు. అయినప్పటికీ ఈ ఐదు నెలలుగా శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్నానని, అందువల్ల ప్రాక్టీస్లో పెద్దగా ఇబ్బంది కలగలేదని, ఇది కొంత వరకు సంతృప్తినిచ్చిందని అన్నాడు. కాగా కోహ్లితోపాటు ఆర్బీసీ ప్లేయర్లు యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీమ్లు కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నారు.
కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు IPLలో ఇప్పటి వరకు రెండు సార్లు రన్నర్స్ అప్గా నిలిచింది. 2009, 2016లలో రెండో స్థానంలో ఆ జట్టు నిలిచింది. అయినప్పటికీ స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్నా ఆ జట్టు ఇంకా ఐIPL ట్రోఫీని లిఫ్ట్ చేయలేదు. ఈసారైనా ట్రోఫీని సాధిస్తారా, లేదా చూడాలి.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!