బహ్రెయిన్:మతధిక్కారం ఆరోపణలతో మతబోధకుడికి రిమాండ్
- August 30, 2020
మనామా:మహ్మద్ ప్రవక్త సహచరులను కించపరిచేలా అతివాద ఉపన్యాసం చేసిన ముస్లిం ప్రభోదకుడికి బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ రిమాండ్ విధించింది. నిందితుడు ఓ వీడియో ఫూటేజ్ లో మహ్మద్ ప్రవక్త సహచరులను అవమానపరిచేలా ప్రసంగించినట్లు స్పష్టంగా ఉందని, ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించేలా అతివాద చర్యలను ప్రొత్సహిస్తుందని ప్రాసిక్యూషన్ అధికారులు ఆరోపించారు. ఇది ఉగ్రవాద చర్యగానే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభోధకుడి ప్రసంగం ఫూటేజి ఆధారంగా అతన్ని కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చిందని, ఈ విచారణలో ప్రభోధకుడి వాదనను ఏకీభవించే విధంగా లేదని అన్నారు. బహ్రెయిన్ ర్యాజ్యాంగం, చట్టాల్లో పొందుపరిచిన నిబంధనల మేరకు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందని, అయితే..మతస్వేచ్ఛకు సంబంధించి భావ్రకటన స్వేచ్ఛ ఇతరులను కించపరిచేలా, అతివాద చర్యలను ప్రేరేపించేలా ఉంటే అది సమాజంలో హింసకు తావిస్తుందని కూడా ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







