బస్సు ప్రమాదానికి గురైన బాధితుడికి Dh2,00,000 నష్టపరిహారం
- August 31, 2020
యూఏఈ: బస్సు ప్రమాదానికి గురైన బాధితుడికి Dh 2,00,000 పరిహారం చెల్లించాలని దుబాయ్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. బస్సు డ్రైవర్, ఇన్సూరెన్స్ సంస్థ పరిహారాన్ని భరించాలని ఆదేశించింది. ఆసియా దేశాలకు చెందిన కార్మికుడు..నిర్మాణ పనుల్లో ఉండగా అతన్ని బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. కార్మికులను పని ప్రదేశాలకు తరలించే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఈ ప్రమాదంలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని కుడి కాలు 30 శాతం శాశ్వతంగా వైకల్యానికి గురైనట్లు మెడికల్ రిపోర్ట్ లో స్పష్టమైంది. అలాగే ఎడమ కాలుకు కూడా గాయాలయ్యాయి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి తనను శాశ్వత వైకల్యం బారిన పడేలా చేసిన డ్రైవర్ తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీ Dh4,00,000 పరిహారం ఇవ్వాలంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన దుబాయ్ న్యాయస్థానం..ఇన్సూరెన్స్ కంపెనీ అభ్యర్ధన మేరకు పరిహారాన్ని తగ్గిస్తూ..బాధితుడికి Dh2,00,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన