డిజిటలైజేషన్ దుబాయ్ లో మరో ముందడుగు..ఆర్టీఏ లో ఈ-సర్టిఫికెషన్ అమలు
- August 31, 2020
రెండేళ్లలో ఆధికార కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలన్న దుబాయ్ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరో ముందడుగు పడింది. ఇందులో భాగంగా దుబాయ్ ఆర్టీఏ ఈ-సర్టిఫికెట్ విధానాన్ని అమలు చేస్తోంది. ఇక నుంచి వాహనాల టెస్టింగ్ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లోనే జారీ చేయనున్నట్లు దుబాయ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధారిటీ ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం వాహనాలను తనిఖీ చేసిన తర్వాత టెస్టింగ్ సర్టిఫికెట్లను ఈ-మెయిల్ చేయనున్నట్లు వెల్లడించింది. దుబాయ్ ఆర్టీఏ ఎల్లప్పుడు దుబాయ్ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలకు అనుగుణంగా నడుచుకుంటుందని, పేపర్ లెస్ విధానం ద్వారా నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని లైసెన్సింగ్ ఏజెన్సీ డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో పేపర్ వినియోగాన్ని తగ్గించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించటంలో కీలకంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఈ-సర్టిఫికెట్ విధానం పట్ల అటు వాహనదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డైరెక్టర్ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









