ఆ ఘోరాన్ని తట్టుకోలేకపోయా...అందుకే వచ్చేసా..సురేష్ రైనా
- September 01, 2020
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని రైనా సోమవారం ట్విట్టర్లో తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. పంజాబ్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని.. తన కుటుంబానికి ఏమైందో తెలియడం లేదని వాపోయాడు. తన మామ, అత్త, ఇద్దరు బంధువులపై దాడి జరిగిందని.. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని ట్వీట్ చేశారు. తను గత రాత్రి తుదిశ్వాస విడిచారని చెప్పాడు. తన అత్త ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపాడు.
అసలా రోజు రాత్రి ఏమైందో ఇప్పటికి తెలియడం లేదని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించాలని పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని.. వారు మరిన్ని దాడులకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరాడు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







