ఆ ఘోరాన్ని తట్టుకోలేకపోయా...అందుకే వచ్చేసా..సురేష్ రైనా
- September 01, 2020
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల్లో ఒకరు కన్నుమూశారు. ఈ విషయాన్ని రైనా సోమవారం ట్విట్టర్లో తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. పంజాబ్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని.. తన కుటుంబానికి ఏమైందో తెలియడం లేదని వాపోయాడు. తన మామ, అత్త, ఇద్దరు బంధువులపై దాడి జరిగిందని.. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని ట్వీట్ చేశారు. తను గత రాత్రి తుదిశ్వాస విడిచారని చెప్పాడు. తన అత్త ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపాడు.
అసలా రోజు రాత్రి ఏమైందో ఇప్పటికి తెలియడం లేదని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించాలని పంజాబ్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే పట్టుకోవాలని.. వారు మరిన్ని దాడులకు పాల్పడకుండా అడ్డుకోవాలని కోరాడు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







