ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఫ్లై దుబాయ్'
- September 01, 2020
యూఏఈ: 'ఫ్లై దుబాయ్' ద్వారా సెప్టెంబర్ 1,2020 మరియు నవంబర్ 30,2020 మధ్య టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు స్వయంచాలకంగా కోవిడ్ -19 ఉచిత గ్లోబల్ ఇన్సూరెన్స్ అందించబడుతుందని బడ్జెట్ క్యారియర్ 'ఫ్లై దుబాయ్' మంగళవారం ప్రకటించింది.
దీని ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లయితే ప్రయాణీకుల ఆరోగ్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులను 'ఫ్లై దుబాయ్' భరిస్తుంది. ఈ కవర్ వారు ప్రయాణించిన సమయం నుండి 31 రోజులు చెల్లుతుంది. దీని ద్వారా ప్రయాణీకులకు వారి వైద్య ఖర్చులకు గాను 150,000 యూరోలు (660,600 దిర్హాములు) మరియు 14 రోజుల పాటు క్వారంటైన్ ఖర్చులకు గాను రోజుకు 100 యూరోలు (440 దిర్హాములు) వరకు ఈ కవరేజ్ నుండి ప్రయాణీకులు లబ్ది పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా అన్నారు.
జులై లో దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ ను తమ ప్రయాణీకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







