ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఫ్లై దుబాయ్'
- September 01, 2020
యూఏఈ: 'ఫ్లై దుబాయ్' ద్వారా సెప్టెంబర్ 1,2020 మరియు నవంబర్ 30,2020 మధ్య టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు స్వయంచాలకంగా కోవిడ్ -19 ఉచిత గ్లోబల్ ఇన్సూరెన్స్ అందించబడుతుందని బడ్జెట్ క్యారియర్ 'ఫ్లై దుబాయ్' మంగళవారం ప్రకటించింది.
దీని ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లయితే ప్రయాణీకుల ఆరోగ్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులను 'ఫ్లై దుబాయ్' భరిస్తుంది. ఈ కవర్ వారు ప్రయాణించిన సమయం నుండి 31 రోజులు చెల్లుతుంది. దీని ద్వారా ప్రయాణీకులకు వారి వైద్య ఖర్చులకు గాను 150,000 యూరోలు (660,600 దిర్హాములు) మరియు 14 రోజుల పాటు క్వారంటైన్ ఖర్చులకు గాను రోజుకు 100 యూరోలు (440 దిర్హాములు) వరకు ఈ కవరేజ్ నుండి ప్రయాణీకులు లబ్ది పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా అన్నారు.
జులై లో దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ ను తమ ప్రయాణీకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







