ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఫ్లై దుబాయ్'
- September 01, 2020యూఏఈ: 'ఫ్లై దుబాయ్' ద్వారా సెప్టెంబర్ 1,2020 మరియు నవంబర్ 30,2020 మధ్య టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు స్వయంచాలకంగా కోవిడ్ -19 ఉచిత గ్లోబల్ ఇన్సూరెన్స్ అందించబడుతుందని బడ్జెట్ క్యారియర్ 'ఫ్లై దుబాయ్' మంగళవారం ప్రకటించింది.
దీని ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లయితే ప్రయాణీకుల ఆరోగ్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులను 'ఫ్లై దుబాయ్' భరిస్తుంది. ఈ కవర్ వారు ప్రయాణించిన సమయం నుండి 31 రోజులు చెల్లుతుంది. దీని ద్వారా ప్రయాణీకులకు వారి వైద్య ఖర్చులకు గాను 150,000 యూరోలు (660,600 దిర్హాములు) మరియు 14 రోజుల పాటు క్వారంటైన్ ఖర్చులకు గాను రోజుకు 100 యూరోలు (440 దిర్హాములు) వరకు ఈ కవరేజ్ నుండి ప్రయాణీకులు లబ్ది పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా అన్నారు.
జులై లో దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ ను తమ ప్రయాణీకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన