ప్రయాణీకులకు భారీ కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఫ్లై దుబాయ్'
- September 01, 2020యూఏఈ: 'ఫ్లై దుబాయ్' ద్వారా సెప్టెంబర్ 1,2020 మరియు నవంబర్ 30,2020 మధ్య టికెట్ బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు స్వయంచాలకంగా కోవిడ్ -19 ఉచిత గ్లోబల్ ఇన్సూరెన్స్ అందించబడుతుందని బడ్జెట్ క్యారియర్ 'ఫ్లై దుబాయ్' మంగళవారం ప్రకటించింది.
దీని ప్రకారం ప్రయాణీకులు తమ ప్రయాణంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినట్లయితే ప్రయాణీకుల ఆరోగ్య ఖర్చులు మరియు నిర్బంధ ఖర్చులను 'ఫ్లై దుబాయ్' భరిస్తుంది. ఈ కవర్ వారు ప్రయాణించిన సమయం నుండి 31 రోజులు చెల్లుతుంది. దీని ద్వారా ప్రయాణీకులకు వారి వైద్య ఖర్చులకు గాను 150,000 యూరోలు (660,600 దిర్హాములు) మరియు 14 రోజుల పాటు క్వారంటైన్ ఖర్చులకు గాను రోజుకు 100 యూరోలు (440 దిర్హాములు) వరకు ఈ కవరేజ్ నుండి ప్రయాణీకులు లబ్ది పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణీకుల భద్రత ను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లై దుబాయ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ హమద్ ఒబైదల్లా అన్నారు.
జులై లో దుబాయ్ అధికారిక ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ ను తమ ప్రయాణీకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు