దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్‌ - ఖతార్‌ రైల్‌ ‘వై ఫై’ భాగస్వామ్యం

- September 02, 2020 , by Maagulf
దోహా మెట్రో ప్రయాణీకుల కోసం వోడాఫోన్‌ - ఖతార్‌ రైల్‌ ‘వై ఫై’ భాగస్వామ్యం

దోహా:వోడా ఫోన్‌ ఖతార్‌, ఖతార్‌ రైల్‌ (క్యు రైల్‌) భాగస్వామ్యంతో పబ్లిక్‌ వైఫై సర్వీస్‌ని దోహా మెట్రో రెడ్‌, గ్రీన్‌ మరియు గోల్డ్‌ లైన్స్‌లో ప్రయాణీకులకు అందించనుంది. అన్ని స్టేషన్లలోనూ అలాగే ట్రైన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. ఎవరైనాసరే మెట్రో ప్రాంగణంలో వైఫై కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు. రిజిస్టర్‌ అయిన వెంటనే 30 నిమిషాల ఉచిత ఇంటర్నెట్‌ యాక్సెస్‌ని ప్రతిరోజూ పొందడానికి వీలుంది. మొత్తం 37 స్టేషన్లలోనూ ఈ వైఫై అందుబాటులో వుంటుంది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com