యూఏఈ టు ఇండియా: ఇప్పుడు ప్రయాణం మరింత సులభం
- September 02, 2020
దుబాయ్: యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఎన్నారైలు ఇకపై ఎంబసీ లేదా కాన్సులేట్ కార్యాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని సంబంధిత అధికారులు తెలిపారు. భారతదేశం, యూఏఈ మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవాసులు నేరుగా విమానయాన సంస్థల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు. కాగా, అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా నింపే సెల్ఫ్-రిపోర్టింగ్ 'ఎయిర్ సువిధ' https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration లో మాత్రం తప్పకుండా రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక ఇటీవల ప్రవాసులు తప్పనిసరిగా ముందు కాన్సులేట్ వెబ్సైట్లో పేరు నమోదు చేసుకున్నాకే ఆన్లైన్లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉండేది.
అయితే అబుధాబి, షార్జా విమానాశ్రయాల నుంచి వచ్చేవారికి పీసీఆర్ టెస్టు తప్పనిసరి అని పేర్కొన్నారు. కానీ దుబాయ్ ఎయిర్పోర్టు నుంచి భారత్కు వచ్చే వారికి కొవిడ్ టెస్టు తప్పనిసరి ఏమీ కాదని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అధికారులు వెల్లడించారు. కాగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ నెల 30 వరకు అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. వందే భారత్ మిషన్, కార్గో విమాన సర్వీసులు యధావిధిగా నడుస్తాయని డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







