ఇండియాకు చేరుకునే ప్రతి ప్రవాసీయుడు కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి చేసిన : సివిల్ ఏవియేషన్
- September 06, 2020
ఒమన్ నుంచి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న ప్రవాస భారతీయులకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది భారత పౌర విమానయాన సంస్థ. ఒమన్ నుంచి ఇండియాకు చేరుకున్న వారు, ఇతర కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్నా..ఫ్లైట్ దిగగానే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. టెస్ట్ ఫలితాల తర్వాత డొమస్టిక్ ఫ్లైట్స్ లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే..గతంలో ఫ్లైట్ ఎక్కే 96 గంటల్లోపు తీసుకున్న ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ, ప్రయాణికులకు ప్రయాణ నిబంధనలను సులభతరం చేయటంతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు 96 గంటల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిబంధనల్లో సడలింపు ఇచ్చారు. దీంతో కోవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్ లేకున్నా..ఫ్లైట్ ఎక్కేందుకు అవకాశం ఇచ్చినట్లైంది. దీంతో అప్రమత్తమైన భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...ఒమన్ లోని ప్రవాస భారతీయులు ఇండియా చేరుకోగానే ముందుగా కోవిడ్ 19 టెస్టులు చేసుకోవటం తప్పనిసరి చేసింది. అయితే..ప్రయాణికులకు సులభతరంగా ఉండేందుకు విమానాశ్రయ ఎంట్రీ పాయింట్లోనే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకునేలా ఎర్పాట్లు చేశారు. టెస్టులో నెగటివ్ వస్తే డొమస్టిక్ ఫ్లైట్ లోకి అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









