ఇండియాకు చేరుకునే ప్రతి ప్రవాసీయుడు కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి చేసిన : సివిల్ ఏవియేషన్
- September 06, 2020
ఒమన్ నుంచి స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న ప్రవాస భారతీయులకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది భారత పౌర విమానయాన సంస్థ. ఒమన్ నుంచి ఇండియాకు చేరుకున్న వారు, ఇతర కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇండియా చేరుకున్నా..ఫ్లైట్ దిగగానే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేసుకోవాలని సూచించింది. టెస్ట్ ఫలితాల తర్వాత డొమస్టిక్ ఫ్లైట్స్ లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే..గతంలో ఫ్లైట్ ఎక్కే 96 గంటల్లోపు తీసుకున్న ఆర్టీ పీసీఆర్ టెస్ట్ ఫలితాలను తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ, ప్రయాణికులకు ప్రయాణ నిబంధనలను సులభతరం చేయటంతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు 96 గంటల లోపు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిబంధనల్లో సడలింపు ఇచ్చారు. దీంతో కోవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్ లేకున్నా..ఫ్లైట్ ఎక్కేందుకు అవకాశం ఇచ్చినట్లైంది. దీంతో అప్రమత్తమైన భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ...ఒమన్ లోని ప్రవాస భారతీయులు ఇండియా చేరుకోగానే ముందుగా కోవిడ్ 19 టెస్టులు చేసుకోవటం తప్పనిసరి చేసింది. అయితే..ప్రయాణికులకు సులభతరంగా ఉండేందుకు విమానాశ్రయ ఎంట్రీ పాయింట్లోనే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకునేలా ఎర్పాట్లు చేశారు. టెస్టులో నెగటివ్ వస్తే డొమస్టిక్ ఫ్లైట్ లోకి అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







