అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి 'నిశ్వర్' సీజ్..నలుగురు అరెస్ట్

- September 06, 2020 , by Maagulf
అబుధాబి: 1.5 టన్నుల నిషేధిత పొగాకు ఉత్పత్తి \'నిశ్వర్\' సీజ్..నలుగురు అరెస్ట్

అబుధాబి పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తి నిశ్వర్ ను అక్రమంగా తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 1.5 టన్నుల నిశ్వర్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. తాత్కాలిక ఫ్యాక్టరీ నుంచి స్వాధీనం చేసుకున్న నిశ్వర్ ముడి పదార్ధాలను, యంత్ర పరికరాలను డాక్యుమెంట్లో రికార్డ్ చేసి వాటిని నాశనం చేసినట్లు పోలీసులు చెప్పారు. చట్టవిరుద్ధంగా నిశ్వర్ తయారు చేసిన నిందితులు అసియాకు చెందిన వ్యక్తులని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com