ఏపీలో ఆగని కరోనా విజృంభణ..

- September 07, 2020 , by Maagulf
ఏపీలో ఆగని కరోనా విజృంభణ..

అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 72,573 శాంపిల్స్‌ ని పరీక్షించగా 10,794 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల చిత్తూర్‌ లో తొమ్మిది మంది, అనంతపూర్‌ లో ఎనిమిది మంది, గుంటూరు లో ఎనిమిది మంది, ప్రకాశం లో ఎనిమిది మంది, కడప లో ఏడుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్‌ లో నలుగురు, నెల్లూరు లో నలుగురు, శ్రీకాకుళం లో ఇద్దరు, విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 11,915 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,95,230 పాజిటివ్ కేసు లకు గాను 3,91,124 మంది డిశ్చార్జ్ కాగా.. 4,417 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,689 గా ఉంది.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com