భారత్ కు 11 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఖతార్ ఎయిర్ వేస్
- September 07, 2020
దోహా:ఖతార్ ఎయిర్ వేస్ భారత్ కు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచే ఇండియాలోని 11 నగరాలకు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 24 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులు కొనసాగుతాయి. అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, కోజికోడ్, ముంబై, తిరువనంతపురానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. భారత్ వెళ్లాలనుకునే వారు లేదంటే భారత్ నుంచి తిరిగి వచ్చే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఖతార్ ఎయిర్ వేస్ కోరింది. అయితే..ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. అలాగే భారత్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలను కూడా ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గనిర్దేశకాలను అనుసరించాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









