భారత్ కు 11 ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఖతార్ ఎయిర్ వేస్
- September 07, 2020
దోహా:ఖతార్ ఎయిర్ వేస్ భారత్ కు ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచే ఇండియాలోని 11 నగరాలకు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 24 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులు కొనసాగుతాయి. అహ్మదాబాద్, అమృత్ సర్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, కోజికోడ్, ముంబై, తిరువనంతపురానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. భారత్ వెళ్లాలనుకునే వారు లేదంటే భారత్ నుంచి తిరిగి వచ్చే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఖతార్ ఎయిర్ వేస్ కోరింది. అయితే..ప్రయాణికుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించింది. అలాగే భారత్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచనలను కూడా ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గనిర్దేశకాలను అనుసరించాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







