ప్రయాణికులకు 5 బిలియన్ల దిర్హామ్ లను చెల్లించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
- September 07, 2020
దుబాయ్:లాక్ డౌన్ సమయంలో విమాన టికెట్లను బుక్ చేసుకొని..ప్రయాణం చేయలేకపోయిన ప్రయాణికులకు టికెట్ ధరలను తిరిగి చెల్లిస్తోంది దుబాయ్ ఎమిరేట్స్ విమానయాన సంస్థ. ఇప్పటివరకు ఏకంగా 5 బిలియన్ల దిర్హామ్ లను ప్రయాణికులకు తిరిగి చెల్లించినట్లు తెలిపింది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటంతో మార్చి నుంచి దాదాపు 90 శాతం విమాన సర్వీసులు రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లంతా తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ సంస్థను కోరారు. ప్రపంచవ్యాప్తంగా తమ సర్వీసులలో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి విన్నపాలు వస్తున్నాయని..మార్చి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.4 మిలియన్ల ప్రయాణికులకు సంబంధించి టికెట్ ధరలను రిఫండ్ చేశామని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వివరించింది. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సంస్థ భాగస్వామ్యుల సాయం కూడా తీసుకుంది. ప్రయాణికుల పక్షాన వారికి కలిగిన అసౌకర్యాన్ని అర్ధం చేసుకోగలమని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పరిష్కరించాల్సిన రిక్వెస్టులు ఎక్కువగా ఉన్నందువల్ల కొందరికి డబ్బు చెల్లించటంలో ఆలస్యం జరుగుతోందని వివరించారు. అయితే..ప్రతి ప్రయాణికుడికి డబ్బులు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు సంస్థ పట్ల నమ్మకం, సహనంతో వ్యవహరించిన ప్రయాణికులను ప్రశంసించారు. ఇదిలా ఉంటే..దశలవారీగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావటంతో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సంస్థ తమ సర్వీసులను క్రమంగా పునరుద్ధరిస్తోంది. ప్రస్తుతం 80 నగరాలకు సర్వీసులను నడుపుతోంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







