వాహనాల స్వాధీనానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన అబుధాబి పోలీసులు
- September 10, 2020
అబుధాబి:నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేసే వారి వాహనాల స్వాధీనానికి సంబంధించి అబుధాబి పోలీసులు కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేశారు. కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం ఎవరైన వాహనదారుడు పోలీసుల వాహనాలను ఢీకొన్నా..పోలీస్ వాహనాల డ్యామేజ్ కి కారణమైనా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు డ్రైవర్ కి 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా రేసింగ్ లలో పాల్గొన్నా, సరైన నెంబర్ ప్లేట్ లేకున్నా ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతివేగంగా నడిపి ప్రమాదాలకు కారణమైనా, రోడ్ క్రాసింగ్ కు నిర్దేశించిన ప్రాంతాల్లో పాదాచారులకు దారి ఇవ్వకున్నా డ్రైవర్ కు 5,000 దిర్హామ్ ల జరిమానా విధిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను ముందు సీటులో కూర్చొబెట్టుకొని డ్రైవింగ్ చేసినా 5,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!