దుర్గమ్మ దసరా ఉత్సవాలపై కీలక నిర్ణయం
- September 10, 2020
విజయవాడ:కరోనా కారణంగా ఈ ఏడాది ఉగాది నుంచి వరసగా అన్ని పండుగలను ఇంట్లోనే జరుపుకున్నారు.అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో పండుగలను నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఇదిలా ఉంటె,విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వచ్చే నెల 17 వ తేదీ నుంచి 25 వరకు దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి.దసరా మహోత్సవాల సమయంలో రోజుకు 10వేలమందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు.దేవస్థానం సిబ్బంది, అర్చకులకు కరోనా టెస్టులు తప్పనిసరి.ఇక అమ్మవారి దర్శనానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







