వాషింగ్టన్ వేదికగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై యూఏఈ-ఇజ్రాయోల్ సంతకాలు
- September 16, 2020అమెరికా:మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి చారిత్రాత్మక ఘటనకు వాషింగ్టన్ వేదికగా నిలిచింది. గత నెలలో శాంతి పునరుద్ధరణ, దౌత్య సంబంధ ఒప్పందంపై అంగీకారం తెలిపిన ఇజ్రాయోల్, యూఏఈ...ఇప్పుడు దౌత్య ఒప్పందానికి సంబంధించి పరస్పరం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..ఈ శాంతి ఒప్పందం యూఏఈ, ఇజ్రాయోల్ మధ్య దౌత్య పురోభివృద్ధికి అలాగే మధ్య ప్రాచ్య దేశాల పురోభివృద్ధికి కూడా తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే..ఈ ఒప్పందం పాలస్తీనా హక్కులకు, దేశపరిరక్షణకు ఏ విధంగానూ ఆటంకం కలిగించబోదని ఆయన అన్నారు. పాలస్తీనాకు మునుపటి తరహాలో తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు అడుగులు పడుతున్న ప్రస్తుత సమయంలో పాలస్తీనా కూడా కొన్ని సానుకూల విధానాలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు