వాషింగ్టన్ వేదికగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై యూఏఈ-ఇజ్రాయోల్ సంతకాలు
- September 16, 2020
అమెరికా:మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి చారిత్రాత్మక ఘటనకు వాషింగ్టన్ వేదికగా నిలిచింది. గత నెలలో శాంతి పునరుద్ధరణ, దౌత్య సంబంధ ఒప్పందంపై అంగీకారం తెలిపిన ఇజ్రాయోల్, యూఏఈ...ఇప్పుడు దౌత్య ఒప్పందానికి సంబంధించి పరస్పరం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..ఈ శాంతి ఒప్పందం యూఏఈ, ఇజ్రాయోల్ మధ్య దౌత్య పురోభివృద్ధికి అలాగే మధ్య ప్రాచ్య దేశాల పురోభివృద్ధికి కూడా తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే..ఈ ఒప్పందం పాలస్తీనా హక్కులకు, దేశపరిరక్షణకు ఏ విధంగానూ ఆటంకం కలిగించబోదని ఆయన అన్నారు. పాలస్తీనాకు మునుపటి తరహాలో తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు అడుగులు పడుతున్న ప్రస్తుత సమయంలో పాలస్తీనా కూడా కొన్ని సానుకూల విధానాలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!







