భారత దేశంలో నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్-మేయర్ బొంతు రామ్మోహన్
- September 16, 2020
హైదరాబాద్:భారత దేశంలో నివాసయోగ్యమైన ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమమైన నగరంగా నిలిచిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...హాలిడిఫై.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో బెస్ట్ లివెబుల్ సిటీగా హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. చారిత్రక గొప్పదనంతో పాటు మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది, ఆర్థిక ప్రగతిలో హైదరాబాద్ ఉత్తమ పర్యాటక నగరంగా స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దికి రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు ఆకాంక్షల మేరకు రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక చొరవ తీసుకొని ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు, అండర్పాస్, జంక్షన్ల అభివృద్ది, స్లిప్ రోడ్లు, లింక్రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నగరంలో వివిధ రంగాల్లో రూ. 50వేల కోట్ల వ్యయంతో అభివృద్ది పనులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో రూ. 30 వేల నుండి రూ. 40వేల కోట్ల వరకు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో నీటి కొరత, విద్యుత్ అంతరాయం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ సమస్యలు లేవని తెలిపారు. హైదరాబాద్లో పెట్టుబడలు పుంజుకోవడానికి, నివాసయోగ్యతకు అనువైనదిగా తెలిపారు.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







