విమానాల్ని పునరుద్ధరించనున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
- September 19, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి అలాగే దుబాయ్కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలపై దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నిషేధం విధించినప్పటికీ, షెడ్యూల్స్ ప్రకారమే తమ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమానాల ద్వారా యూఏఈకి తమ వెంట కరోనాని తీసుకువచ్చిన దరిమిలా, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ అవ్వాల్సిన విమానాలు షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆపరేట్ కానున్నాయి. రీషెడ్యూల్ అయిన విమానాలు కాలికట్, తిరువనంతపురం, ముంబై మరియు కన్నూర్లకు చేరుకోనున్నాయి. శుక్రవారం విమానాలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆపరేట్ అయ్యాయని ఎయిర్లైన్ అఫీషియల్ ఒకరు చెప్పారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







