తెలంగాణ లో కొత్తగా కరోనా 2,137 పాజిటివ్ కేసులు నమోదు
- September 20, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో ఎప్పటిలాగానే 2 వేలకు పైగా కోరనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,137 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 71 వేల 306కు చేరుకుంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1033కు చేరుకుంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య రాష్ట్రంలో లక్షా 39 వేల 700కు చేరుకుంది. ఇంకా 30573 యాక్టివ్ కేసులున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ నిలకడగానే కొనసాగుతోంది.హైదరాబాదులో గత 24 గంటల్లో 322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 182 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఆ జిల్లాలో కేవలం 146 కేసులు మాత్రమే రికార్డయ్యాయి.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..