షార్జా:కోవిడ్ నిబంధనలు పాటించని 2,437 మంది ప్రవాసీయులకు ఫైన్
- September 20, 2020
షార్జా:కోవిడ్ నిబంధనల అమలును పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు షార్జా పోలీసులు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించటంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని మళ్లీ క్వారంటైన్ తరలించి సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు చపట్టారు. క్వారంటైన్ ఉండాల్సిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్లను అరెస్ట్ చేయటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని క్వారంటైన్ లో ఉండాల్సిన ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే...కోవిడ్ నిబంధనల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న షార్జా పోలీసులు...నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు 2,437 మంది ప్రవాసీయులు నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించామని, 26 రకాల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 2,486 ఫైన్లు వేశామని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనలో ఎక్కువగా ఫేస్ మాస్కులు ధరించటపోవటం, బౌతిక దూరం పాటించకపోవటం, ఒకే వాహనంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు కంటే ఎక్కువగా ప్రయాణించటం వంటివి ఎక్కువగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్
- తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- టీవీ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్
- కువైట్ లో విషాదం..రోడ్డు పై 5 మంది మృతి!!
- ప్రయాణికులకు ఊరట.. గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- కువైట్ కాన్సులేట్ పై జరిగిన దాడిని ఖండించిన ఒమన్..!!
- పౌల్ట్రీ ఉత్పత్తుల ఆందోళనపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- ఖతార్ రియల్ దూకుడు.. సైలెంట్ మంత్ లోను వృద్ధి నమోదు..!!
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...









