షార్జా:కోవిడ్ నిబంధనలు పాటించని 2,437 మంది ప్రవాసీయులకు ఫైన్
- September 20, 2020
షార్జా:కోవిడ్ నిబంధనల అమలును పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు షార్జా పోలీసులు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించటంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని మళ్లీ క్వారంటైన్ తరలించి సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు చపట్టారు. క్వారంటైన్ ఉండాల్సిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్లను అరెస్ట్ చేయటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని క్వారంటైన్ లో ఉండాల్సిన ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే...కోవిడ్ నిబంధనల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న షార్జా పోలీసులు...నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు 2,437 మంది ప్రవాసీయులు నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించామని, 26 రకాల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 2,486 ఫైన్లు వేశామని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనలో ఎక్కువగా ఫేస్ మాస్కులు ధరించటపోవటం, బౌతిక దూరం పాటించకపోవటం, ఒకే వాహనంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు కంటే ఎక్కువగా ప్రయాణించటం వంటివి ఎక్కువగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







