కువైట్: జనసమూహాలు, కోవిడ్ నిబంధనలపై ఉల్లంఘనలపై కఠిన చర్యలు
- September 21, 2020
కువైట్ సిటీ:కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు మంత్రి మండలి సూచించిన నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కువైట్ హెచ్చరించింది. సమాజ భద్రత కోసం పౌరులు, ప్రవాసీయులు అంతా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. మంత్రిమండలి సూచనలకు విరుద్ధంగా జనం సమూహంగా చేరినా..ఇతర ఆరోగ్య రక్షణ సూచనలను పాటించకపోయిన చర్యలు తీవ్రంగా ఉంటాయని అంతర్గత మంత్రిత్వ శాఖ వార్నింగ్ ఇచ్చింది. నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అంతర్గత మంత్రిత్వ శాఖ..ఎప్పకప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి జనం గుమికూడకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు వెల్లడించింది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఈవెంట్లు ప్రచారం చేస్తున్న వారిని కూడా మంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించటంలో విఫలమైన ఈవెంట్ ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే బహిరంగ ప్రదేశాల్లో, వాణిజ్య కేంద్రాలు, షాపింగ్ మాల్స్ లో ప్రజలు అంతా ఫేస్ మాస్కులు ధరించాలంటూ ఇప్పటికే ప్రచారం చేపట్టారు. ఎవరైనా మాస్కులు ధరించకుంటే జరిమానా విధిస్తున్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









