ప్రయాణికులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి:ఒమన్
- September 21, 2020
మస్కట్:అక్టోబర్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్ధమవుతున్న ఒమన్ ప్రభుత్వం..ప్రయాణికులు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.ప్రయాణికుల భద్రత కోసం విమానాశ్రయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై దృష్టి సారిస్తూనే..కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలపై ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా విదేశాల నుంచి ఒమన్ చేరుకునే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ఒమన్ లో ఉద్యోగం చేసే వారు కంపెనీ స్పాన్సర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. విమానం ఎక్కే సమయంలో సిబ్బందికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూపించాలి.అలాగే సదరు ప్రయాణికుడి జర్నీలో అధికారులు ఎప్పుడు అడిగినా సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. గమ్యస్థానం చేరుకున్న తర్వాత కూడా అధికారులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. స్పాన్సర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుంటే అతన్ని ప్రయాణానికి అనుమతించరు.ఇక కరోనా నేపథ్యంలో ఒమన్ చేరుకున్న ప్రతి ప్రయాణికుడు ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలి.అలాగే కనీసం 30 రోజులు పాటు ఆస్పత్రి ఖర్చులు వర్తించేలా బీమా చేసుకొని ఉండాలని ఒమన్ పౌర విమానయాన అధికార విభాగం ప్రకటించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







