కువైట్:క్వారంటైన్ గడువును 7 రోజులకు కుదించాలని ప్రతిపాదించిన డీజీసీఏ
- September 21, 2020
కువైట్ సిటీ:కువైట్ లో క్వారంటైన్ గడువు ఇక నుంచి ఏడు రోజులే ఉండే అవకాశాలున్నాయి. విమాన ప్రయాణికుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు తగ్గించాలని కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం కువైట్ చేరే విమాన ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన అమలులో ఉంది. అయితే..ఈ సమాయాన్ని సగం రోజులకు తగ్గించాలన్నది డీజీసీఏ ప్రతిపాదన. అంతేకాదు..ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు లేఖ రాసింది. ప్రస్తుతం అమలులో ఉన్న 14 రోజుల క్వారంటైన్ కాలపరిమితిని 7 రోజులకు కుదించాలని కోరింది. అయితే..ప్రయాణికులు అందరూ కోవిడ్ లేదని నిర్దారించే ఆర్టీ పీసీఆర్ నెగటీవ్ సర్టిఫికెట్ ను చూపించాల్సిందేనని పేర్కొంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









