రియాద్: మినహాయింపు వర్గాలకి ప్రయాణ అనుమతికి షరతులు
- September 27, 2020రియాద్:కోవిడ్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన ప్రస్తుత సమయంలో కొన్ని మినహాయింపు వర్గాలకు ప్రయాణ అనుమతులకు సంబంధించి షరతులను ప్రకటించింది పాస్ పోర్ట్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం. ప్రయాణ అనుమతికి అర్హులైన వారిలో తొలిగా పలు విభాగాల్లో అధికారిక కార్యాకలాపాల నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన వారు ప్రయోజనం పొందనున్నారు. అధికారులు తమకు నిర్దేశించిన విధులను వర్చువల్ విధానంలో, ఆన్ లైన్ ద్వారాగానీ చేయలేని పరిస్థితులు ఉన్నా..వ్యక్తిగతంగా తమ హాజరు తప్పరిసరి అయినా..ఆ విధులను నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాల్సి ఉన్న వారికి ప్రయాణ అనుమతి
ఇవ్వనున్నారు. అలాగే సౌదీ జాతీయుల బంధువులు విదేశాల్లో ఉన్నట్లైతే..వాళ్లు కింగ్డమ్ వచ్చే పరిస్థితులు లేని సందర్భాల్లో ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే..తమ బంధువులు విదేశాల్లో ఉన్నట్లు ఆధారాలు, వాళ్లు కింగ్డమ్ రాలేని పరిస్థితులను పాస్ పోర్ట్ అధికారులకు వివరించాల్సి ఉంటుంది. ఇక విదేశాల్లో ఉంటున్న సౌదీ పౌరులు, వారి మీద ఆధారపడే వారు ప్రయాణ అనుమతులకు సంబంధించి మినహాయింపు పొందే మూడో వర్గంలోకి వస్తారు. వారు విదేశాల్లో ఉంటున్నట్లు, ఏ దేశంలో ఉంటున్నారో ఆధారాలు చూపించి ప్రయాణ అనుమతి పొందవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల