820 వాహనాలను స్వాధీనం చేసుకున్న రాస్ ఆల్ ఖైమా పోలీసులు
- September 27, 2020రాస్ ఆల్ ఖైమా:రోడ్ల పక్కన, గ్యారేజ్ లు, ఇతర ప్రాంతాల్లో చాలా కాలంగా వదలేసిన వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మే నుంచి మొత్తం 820 వాహనాలను జప్తు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. నిర్వహణ లేకుండా వదిలేసిన వాహనాలు దుమ్ము, ధూళితో అధ్వాన్నంగా మారి సిటీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అలాంటి వాహనాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించిన పోలీసులు..ఇప్పటికే ఆయా వాహనాల ఒనర్లకు నోటీసులు కూడా జారీ చేశారు. పది రోజుల్లో వాహనాలను అక్కడి నుంచి తీసేయాలని గడువు ఇచ్చారు. నిర్దేశించిన గడువులోగా తీసుకుపోని వాహనాలను రాస్ ఆల్ ఖైమా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అమ్మకానికి పెట్టనున్నారు. ఇక నెంబర్ ప్లేట్లు లేకుండా వదిలేసిన వాహనాల విషయంలో నోటీసులు కూడా ఇవ్వబోమని..ఆ మరుక్షణమే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే పాడైపోయిన వాహనాలు, దుమ్ము పట్టి అధ్వాన్నంగా ఉన్న వాహనాలు, నడవటానికి వీల్లేని వాహనాల విషయంలోనూ నోటీసులు ఇవ్వబోమని...వెంటనే సీజ్ చేస్తామని స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ