వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం...
- September 27, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈబిల్లులు చట్టబద్దం అయ్యాయి. ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్నా రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం విశేషం. జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. కాగా, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు బిల్లులను ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుపై రాజ్యసభలో పెద్ద రగడ జరిగింది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని కేంద్రం చెప్తున్నది. అయితే, ఈ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..