వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం...
- September 27, 2020న్యూ ఢిల్లీ:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బిల్లులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రైతు బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఈబిల్లులు చట్టబద్దం అయ్యాయి. ప్రతిపక్షాలు, కొన్ని మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వస్తున్నా రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయడం విశేషం. జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. కాగా, ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు బిల్లులను ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లుపై రాజ్యసభలో పెద్ద రగడ జరిగింది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ, మోజువాణి ఓటుతో బిల్లును ఆమోదింపజేశారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ బిల్లులు దోహదపడతాయని కేంద్రం చెప్తున్నది. అయితే, ఈ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం