తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

- September 29, 2020 , by Maagulf
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,072 కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది.అటు, కొత్తగా కరోనాతో 9 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,89,283కి చేరింది. ఇప్పటివరకూ కరోనా కాటుకి 1,116 మంది బలైయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,58,690 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 29,477 మంది చికిత్స పొందుతున్నారు.


--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com