బోటులో అగ్ని ప్రమాదం

- October 02, 2020 , by Maagulf
బోటులో అగ్ని ప్రమాదం

దుబాయ్‌: దుబాయ్‌ జుమైరా బీచ్‌ రెసిడెన్స్‌ సమీపంలో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఓ వ్యక్తి ఈ మంటల కారణంగా గాయపడ్డారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 9.23 నిమిషాల సమయంలో ఎమర్జన్సీ కాల్‌ అందుకున్నామనీ, వెంటనే ఫైర్‌ ఫైటర్స్‌ బృందం అల్‌ మర్సా ఫైర్‌ స్టేషన్‌ నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చానీ అధికారులు వివరించారు. దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com