105 ఇండియన్‌ పోర్ట్‌ వర్కర్స్‌కి దక్కని వేతనాలు

- October 03, 2020 , by Maagulf
105 ఇండియన్‌ పోర్ట్‌ వర్కర్స్‌కి దక్కని వేతనాలు

కువైట్‌ సిటీ: 105 మంది ఇండియన్‌ వర్కర్స్‌ (అందులో 99 మంది తమిళనాడుకు చెందినవారు), జూన్‌ నుంచి వేతనాలు అందుకోలేకపోతున్నారు. వీరంతా షుయైబా పోర్టులో పనిచేస్తున్నారు. వేతనాలు అందకపోవడంతో వీరంతా ఇండియన్‌ ఎంబసీ తమ వేతనాల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. భారత రాయబారి సిబి జార్జి, కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. వేతనాలు అందకపోవడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, ఇంటి అద్దె చెల్లించలేక.. పూట గడవడం కూడా కష్టమవుతోందని కార్మికులు వాపోతున్నారు. అక్టోబర్‌ - డిసెంబర్‌ మధ్య తమ రెసిడెన్స్‌ గడువు తీరే అవకాశం వుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెలు చెల్లించలేకపోవడంతో ల్యాండ్‌ లార్డుల నుంచి సమస్యల వస్తాయని ఆవేదన చెందుతున్నారు బాధిత కార్మికులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com