ముందస్తు అనుమతి లేకుండా ఈ విమానాశ్రయం చేరుకోవచ్చు

- October 06, 2020 , by Maagulf
ముందస్తు అనుమతి లేకుండా ఈ విమానాశ్రయం చేరుకోవచ్చు

రస్‌ అల్‌ ఖైమా: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, రస్‌ అల్‌ ఖైమా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా అక్టోబర్‌ 15 నుంచి రెసిడెంట్స్‌ దేశంలోకి ముందస్తు అనుమతి లేకుండా రావొచ్చని పేర్కొంది. అక్టోబర్‌ 15 నుంచి కొత్త ట్రావెల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కోవిడ్‌19 టెస్ట్‌ (ఫలితం నెగెటివ్‌ అయి వుండాలి) 96 గంటలకు ముందుగా తీసుకుని రావాల్సి వుంది. ట్రావెలర్స్‌ లేదా స్పాన్సరర్స్‌ మరో లేబ్‌ టెస్ట్‌ లేదా పిసిఆర్‌ టెస్ట్‌కి సంబంధించిన ఖర్చు భరించాల్సి వుంటుంది. టూరిస్ట్‌ మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ వుండి, ట్రావెల్‌ టికెట్‌ని పొంది వుండి అలాగే తగిన ట్రావెల్‌ రిక్వైర్‌మెంట్స్‌ వుంటే టూరిస్టులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు. వీరికి కూడా పిసిఆర్‌ టెస్ట్‌ తప్పనిసరి. ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా రస్‌ అల్‌ ఖైమా నుంచి ఎవరైనా ఏ దేశానికి అయినా వెళ్ళడానికి వీలు కలిపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com