వైర్‌ టాపింగ్‌ - చట్టంపై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ స్పష్టత

- October 08, 2020 , by Maagulf
వైర్‌ టాపింగ్‌ - చట్టంపై పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ స్పష్టత

సౌదీ: లేఖలు, పబ్లికేషన్స్‌, పార్సెల్స్‌, ఫోన్‌ కన్వర్జేషన్స్‌ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప.. సాధారణంగా మానిటర్‌ చేసే పరిస్థితి వుండదని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పష్టతనివ్వడం జరిగింది. ఆయా నేరాల పరిశోధన సందర్భంలో, కొన్ని నేరాల్ని నిలువరించే క్రమంలో.. అథారిటీస్‌, ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో భాగంగా ‘మానిటరింగ్‌’ వుంటుందే తప్ప, ప్రతి ఒక్కరి మీదా మానిటరింగ్‌వ ఉంటుందనడం సబబు కాదన్నది పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వాదన. చాలా దేశాల్లో ఈ విధానమే అమల్లో వుందనీ, ఇక్కడా అదే జరుగుతోందని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. క్రిమినల్‌ ప్రొసిడ్యూర్‌ చట్టం - ఆర్టికల్‌ 57 ప్రకారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, లెటర్లు అలాగే పబ్లికేషన్స్‌, పార్సిల్స్‌ వంటివాటి ఇంటర్‌సెప్షన్‌ కోసం ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎవరి ప్రైవసీకీ ఆటంకం కలిగించేలా అథారిటీస్‌ వ్యవహరించబోవని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తేల్చి చెప్పింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com