రోడ్లపై వదిలేసిన కార్లను తొలిగిస్తున్న మస్కట్ మున్సిపాలిటి
- October 08, 2020
మస్కట్:కొన్నాళ్లుగా రోడ్లపై వదిలేసిన కార్లను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తోంది మస్కట్ మున్సిపాలిటి. ప్రస్తుతం ఘాల ఇండస్ట్రీయల్ జోన్ లో చాలా కాలంగా పట్టించుకోకుండా వదిలేసిన వాహనాలను అక్కడి నుంచి తరలిస్తున్నట్లు మున్సిపాలిటి అధికారులు తెలిపారు. రోడ్ల పక్కన, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో వాహన యజమానులు తమ కార్లను పార్క్ చేసి వాటిని పట్టించుకోకుండా నెలల తరబడి వదిలివేస్తున్న విషయం తెలిసిందే. అవి దుమ్ము కొట్టికుపోయి నగర పరిశుభ్రతకు ఆటంకం కలిగించటమే కాకుండా..చోరీ ఘటనలకు ఆస్కారంగా మారుతున్నాయి. దీంతో మస్కట్ మున్సిపాలిటీ అధికారులు రోడ్ల పక్కన, ఇండస్ట్రీయల్ జోన్లలో వదిలేసిన కార్లను వెంటనే తొలగించాలని ఇప్పటికే పలు మార్లు హెచ్చరించారు. కొందరు వాహనదారులు పట్టించుకోకపోవటంతో మున్సిపాలిటీ అధికారులు ఆ వాహనాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగానే ఘాలా పారిశ్రామిక వాడలోని కార్లను స్వాధీనం చేసుకొని ఇతర ప్రాంతాలకు తరలించారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







