తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు
- October 09, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా... 18 వందల 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2 లక్షల 8 వేలు దాటినట్టు... వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్క రోజులో కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 12 వందల 8కి చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్కరోజులో... 18 వందల 78 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య ఒక లక్షా 80 వేల 953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 వేల 374 యాక్టివ్ కేసులు ఉండగా... వీరిలో.. 21 వేల 801 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజులో.. 53 వేల 86 పరీక్షలు నిర్వహించగా... ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 34 లక్షల 49 వేల 925 టెస్టులు నిర్వహించినట్టు.. హెల్త్ బులెటిన్లో ప్రభుత్వం పేర్కొంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ప్రమాదంలో గ్రామ సచివాలయాలు: పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వ్యవస్థాగత వైఫల్యాలు బహిర్గతం
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం









