చిరువ్యాపారులకు ఊరట..
- October 09, 2020
న్యూ ఢిల్లీ:ఎవరి మీదా ఆధారపడకుండా ఏదో ఒకటి చేసుకోవాలి. అందుకోసం కొంతైనా పెట్టుబడికావాలి. అయిన వాళ్లని అడుగుదామన్నా వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వారికి ఆసరాగా నిలుస్తోంది పీఎం స్వనిధి స్కీమ్. ఇకపై ఎస్బీఐ కూడా ఇముద్రా ప్లాట్ఫామ్ ద్వారా లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశీయ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కూడా పీఎం స్వనిధి స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. ఇందుకోసం ఎస్బీఐ ఇ-ముద్రా పోర్టల్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)ను లాంచ్ చేసింది. 50 లక్షల మంది వెండర్లకు ప్రయోజనం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. లోన్ కింద తీసుకున్న రుణాన్ని ఈఎంఐ రూపంలో కడుతూ రావాలి. ఏడాది గడువులో రుణం మొత్తాన్ని చెల్లించాలి.ఈ తరహా రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తుంది. అంతే కాకుండా ప్రతి నెలా సమయానికి ఈఎంఐ కట్టే వారికి ఏడాదిలో రూ.1200 క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ స్కీమ్ ప్రవేశ పెట్టిన తరువాత ఇప్పటి వరకు 7.85 లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. బ్యాంకులో లోన్ తీసుకోదలచిన వారు https://emudra.sbi.co.in:8044/emudra ద్వారా అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









