ఒమన్ లో అమలులోకి వచ్చిన 14 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్

- October 12, 2020 , by Maagulf
ఒమన్ లో అమలులోకి వచ్చిన 14 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్

మస్కట్:కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఒమన్ సుప్రీం కమిటీ దేశంలో విధించిన పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు 14 రోజుల పాటు నైట్ లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఈ 14 రోజుల పాటు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పబ్లిక్ ప్రాంతాలు, షాపులు మూసివేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని రాయల్ ఒమన పోలీసులు హెచ్చరించారు. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.  ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com