ఒమన్ లో అమలులోకి వచ్చిన 14 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్
- October 12, 2020
మస్కట్:కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఒమన్ సుప్రీం కమిటీ దేశంలో విధించిన పాక్షిక లాక్డౌన్ అమలులోకి వచ్చింది. ఆక్టోబర్ 11 నుంచి 24 వరకు 14 రోజుల పాటు నైట్ లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఈ 14 రోజుల పాటు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పబ్లిక్ ప్రాంతాలు, షాపులు మూసివేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. లాక్డౌన్ అమలులో సమయంలో ఎవరూ బయటికి రావొద్దని రాయల్ ఒమన పోలీసులు హెచ్చరించారు. నైట్ లాక్డౌన్ అమలులోకి రావటంతో..ప్రజా రవాణా వ్యవస్థల టైమింగ్స్ ను రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. మస్కట్-సలాహ్ మధ్య బస్సు సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఒమన్ జాతీయ రవాణా సంస్థ ఎంవసలాత్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఇక మస్కట్ సిటీ, ఇంటర్ సిటీ(సలాహ్ మినహా) సర్వీసులు సాయంత్రం 6 గంటలలోగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక









