ఫేస్బుక్ మెసెంజర్లో కొత్త ఫీచర్
- October 14, 2020
ప్రముఖ సాంకేతిక దిగ్గజం ఫేస్బుక్ మెసెంజర్లో మరో ఫీచర్ ను తీసుకురానుంది.చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు, సరిపడా ప్రతిస్పందనలను ప్రవేశపెట్టనుంది. ఇక ఫేస్బుక్ డార్క్ మోడ్ లక్షణాన్ని కూడ విడుదల చేయనుంది.దీంతో చాట్ నుండి బయటకు వెళ్లినప్పుడు లేదా అవి చూసిన తర్వాత మెసేజ్లు అదృశ్యమవుతాయి.'మెసేజులు మాత్రమే పంపుకునే దశ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్తో వివిధ యాప్లు, పరికరాల ద్వారా హ్యాంగవుట్ అయ్యేందుకు నూతన మార్పులు వీలు కల్పిస్తాయి అని' మెసెంజర్ వైస్ ప్రెసిడెంట్ స్టాన్ చుడ్నోవీస్కీ ఒక బ్లాగ్ పోస్ట్లో రాశారు. భవిష్యత్ మెసెజింగ్కు అనుగుణంగా మార్పులు ఉంటాయని ఫేస్బుక్ వెల్లడించింది. ఫేస్బుక్ మెసెంజర్ కొత్త లోగో కూడా నీలం రంగు నుంచి కొద్దిగా మారనుంది.ఇటీవల ఫేస్బుక్ మెసెంజర్ను ఇన్స్టాగ్రామ్తో అనుసంధానించింది.దీంతో మెసెంజర్ లేదా ఇన్స్టాలలో ఒకద్నాంచి మరొదానికి మెసేజులు పంపుకునే వీలుంది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









