కువైట్:సమస్యలు ఏవైనా మదద్ ద్వారా తెలియజేయాలని కోరిన ఇండియన్ ఎంబసీ
- October 15, 2020కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయులు..తమ సమస్యలను మదద్ ద్వారా తమ దృష్టికి తీసురావొచ్చని తెలిపింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. దేశంగానీ దేశంలో భారతీయులకు ఐదేళ్లుగా మదద్ ద్వారా కువైట్ లోని ఇండియన్ ఎంబసీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కోర్టు కేసులు, నష్టపరిహారం చెల్లింపులు, జైలు శిక్ష ఎదుర్కుంటున్న వారు, స్వదేశానికి మృతదేహాల తరలింపు, బకాయి జీతాలు, ఏజెంట్ల చేతిలో మోసపోయిన సందర్భాలు, కనిపించకుండా పోయిన వ్యక్తుల గురించి ఆరా తీయటం..ఇలాంటి సమస్యలు ఉంటే మదద్ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు. ఆ తర్వాత సమస్యను తెలుసుకొని భారతీయులకు ఎంబసీ అధికారులు తమ పరిధిలో సాయం అందిస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులు తమ సమస్యలు చెప్పుకొని తగిన సాయం పొందెందుకు ఉండేందుకు 2015లో భారత విదేశాంగ శాఖ మదద్ వెబ్ సైట్ ను ప్రారంభించింది. http://www.madad.gov.in ద్వారా ప్రవాసీయులు తమ సమస్యను
చెప్పుకోవచ్చు. ప్రవాసీయులకు మరింత వేగంగా మదద్ సేవలు అందించేందుకు మదద్ మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..