కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన
- October 15, 2020అబుధాబి:ఇండియన్లకు పాస్ పోర్టుల జారీ విషయంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పాస్ పోర్టు గడువు ముగిసిన వారు, రెసిడెన్సీ గడువు ముగిసినవారు..లేదంటే నవంబర్ 30తో గడువు ముగిసే వారికి మాత్రమే పాస్ పోర్టులను పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కేవలం వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఎవరికైన అత్యవసరంగా పాస్ పోర్టు పొందాల్సిన అవసరం ఉంటే..వారు పాస్ పోర్టు దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి..ఏ అత్యవసర పని కోసం పాస్ పోర్టు కోరుతున్నారో వివరిస్తూ లేఖను జతపరిచి [email protected].కి మెయిల్ చేయాలని రాయబార కార్యాలయం తెలపింది. మెయిల్ కు వచ్చే ప్రతి దరఖాస్తును తాము విధిగా పరిశీలిస్తామని, అవసరం ఉందనుకుంటే వారికి ఎంబసీ తరపున తగిన సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించింది. పాస్ పోర్టు దరఖాస్తు సూచనలను ఇండియన్లు గమనించి అధికారులకు సహకరించాలని కార్యాలయ అధికారులు కోరారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..