దుబాయ్: కోవిడ్ 19 వాక్సిన్ వేయించుకున్న NCEMA జనరల్ డైరెక్టర్
- October 15, 2020
దుబాయ్: జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం జనరల్ డైరెక్టర్ ఓబైద్ రషీద్ అల్ షంసీ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆరోగ్య భద్రత కోసం ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఆయన ఈ రోజు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల ఆరోగ్య శ్రేయస్సుకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుందని, తమ విధుల్లో భాగంగా సేవలు అందించే సమయంలో వారు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవటం తమ బాధ్యత అని NCEMA జనరల్ డైరెక్టర్ అల్ షంసీ అన్నారు. తమ విధుల్లో భాగంగా కోవిడ్ 19 పేషెంట్లతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చే వైద్య సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్ వినియోగించేందుకు యూఏఈ ప్రభుత్వం అత్యవసరంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







