దుబాయ్: కోవిడ్ 19 వాక్సిన్ వేయించుకున్న NCEMA జనరల్ డైరెక్టర్
- October 15, 2020
దుబాయ్: జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అధికార విభాగం జనరల్ డైరెక్టర్ ఓబైద్ రషీద్ అల్ షంసీ కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆరోగ్య భద్రత కోసం ఫ్రంట్ లైన్ వర్కర్లు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్న వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గనిర్దేశకాల మేరకు ఆయన ఈ రోజు వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల ఆరోగ్య శ్రేయస్సుకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రధాన్యత ఇస్తుందని, తమ విధుల్లో భాగంగా సేవలు అందించే సమయంలో వారు వైరస్ బారిన పడకుండా కాపాడుకోవటం తమ బాధ్యత అని NCEMA జనరల్ డైరెక్టర్ అల్ షంసీ అన్నారు. తమ విధుల్లో భాగంగా కోవిడ్ 19 పేషెంట్లతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చే వైద్య సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు వ్యాక్సిన్ వినియోగించేందుకు యూఏఈ ప్రభుత్వం అత్యవసరంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో గన్ తో కానిస్టేబుల్ హాల్ చల్
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!









