దోహా: వీధులు, పారిశ్రామిక వాడల్లో వదిలి వెళ్లిన 9,300 వాహనాల స్వాధీనం
- October 15, 2020
దోహా:రోడ్లకు ఇరు వైపుల, వీధులు, పారిశ్రామిక వాడల్లో వాహనదారులు నిరుపయోగంగా వదిలేసిన కార్లను ఖతార్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత జనవరి నుంచి ఇప్పటివరకు 9.300 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరు వాహనదారులు వాహనాలను వీధుల్లో వదిలేసి వాటిని పట్టించుకోటం లేదని, అవి దుమ్ముకొట్టుకుపోయి పరిశుభ్ర వాతావరణానికి హానికరంగా మారటమే కాకుండా, ఆయా నగరాల ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేస్తున్నాయన్నది అధికారుల వాదన. అంతేకాదు...చోరీలకు కూడా ఆస్కారం ఇస్తున్నాయని చెబుతున్నారు. అందుకే వీధులు, పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా వదిలివేసిన వాహనాలను యజమానులు తీసుకువెళ్లాలని చాలాసార్లు సూచించామని, అయితే..వారు స్పందించకపోవటంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. వివిధ మున్సిపాలిటీ పరిధిలో నిరుపయోగంగా వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టిన జాయింట్ కమిటీ..చివరగా అల్ షిహానియా మున్సిపాలిటీ పరిధిలో వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలో 150 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదికి ఇదే చివరి డ్రైవ్ అని.. వచ్చే ఏడాది కొత్త స్ట్రాటజీతో మళ్లీ వాహనాల తొలగింపు డ్రైవ్ చేపడతామని జాయింట్ కమిటీ స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రారంభమైన ఈ డ్రైవ్ లో ఇప్పటివరకు 81,000 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 44,000 వాహనాలను డిస్పోజ్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







