దోహా: వీధులు, పారిశ్రామిక వాడల్లో వదిలి వెళ్లిన 9,300 వాహనాల స్వాధీనం
- October 15, 2020
దోహా:రోడ్లకు ఇరు వైపుల, వీధులు, పారిశ్రామిక వాడల్లో వాహనదారులు నిరుపయోగంగా వదిలేసిన కార్లను ఖతార్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గత జనవరి నుంచి ఇప్పటివరకు 9.300 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరు వాహనదారులు వాహనాలను వీధుల్లో వదిలేసి వాటిని పట్టించుకోటం లేదని, అవి దుమ్ముకొట్టుకుపోయి పరిశుభ్ర వాతావరణానికి హానికరంగా మారటమే కాకుండా, ఆయా నగరాల ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేస్తున్నాయన్నది అధికారుల వాదన. అంతేకాదు...చోరీలకు కూడా ఆస్కారం ఇస్తున్నాయని చెబుతున్నారు. అందుకే వీధులు, పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా వదిలివేసిన వాహనాలను యజమానులు తీసుకువెళ్లాలని చాలాసార్లు సూచించామని, అయితే..వారు స్పందించకపోవటంతో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. వివిధ మున్సిపాలిటీ పరిధిలో నిరుపయోగంగా వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టిన జాయింట్ కమిటీ..చివరగా అల్ షిహానియా మున్సిపాలిటీ పరిధిలో వాహనాల తొలగింపు డ్రైవ్ చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలో 150 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదికి ఇదే చివరి డ్రైవ్ అని.. వచ్చే ఏడాది కొత్త స్ట్రాటజీతో మళ్లీ వాహనాల తొలగింపు డ్రైవ్ చేపడతామని జాయింట్ కమిటీ స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రారంభమైన ఈ డ్రైవ్ లో ఇప్పటివరకు 81,000 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 44,000 వాహనాలను డిస్పోజ్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









